విశాఖలో మావోల ఎన్‌కౌంటర్.. తెలంగాణ వాసి మృతి

విశాఖలో మావోల ఎన్‌కౌంటర్.. తెలంగాణ వాసి మృతి

విశాఖపట్నం: మన్యం కాల్పులతో దద్దరిల్లింది. విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలం ముంప పోలీస్ స్టేషన్ పరిధిలని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. మావోలు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో ముంప పరిధిలో భద్రతా దళాలతో కలసి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తెలంగాణ వాసి, డీసీఎం కమాండర్ సందె గంగయ్యతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఏకే47తోపాటు పలు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.