
ములుగు (గోవిందరావుపేట), వెలుగు : గోవిందరావుపేట మండల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 77మందికి రూ.65వేల జరిమానాతోపాటు ఐదుగురికి మూడు రోజుల జైలు శిక్ష పడినట్లు పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు.
కొద్ది రోజులుగా పస్రా, గోవిందరావుపేట పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం తాగి బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 77మంది పట్టుబడ్డారని, వారికి ములుగు కోర్టు జేఎఫ్ కోర్టు మెజిస్ట్రేట్జ్యోత్స్న రూ.65వేల జరిమానా, ఐదుగురికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.