శాన్ఫ్రాన్సిస్కో: తన కొడుకు నుంచి విడాకులు అడిగిందని కోపం పెంచుకున్న మామ కొడలిని తుపాకీతో కాల్చి చంపేశాడు. కాలిఫోర్నియా స్టేట్లో పోయినవారం జరిగిన ఈ ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమెను చంపింది మామేనని తేల్చి కోర్టులో శుక్రవారం ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు వివరాలు వెల్లడించారు. యూఎస్లోని ప్రెస్నోలో ఉండే శీతల్ సింగ్ కొడుకుతో గురుప్రీత్ కౌర్కు కొన్నేండ్ల కింద పెళ్లైంది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగినా ఆపై గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది.
లీగల్గా విడాకుల ప్రాసెస్ మొదలు పెట్టిన గురుప్రీత్సింగ్ ఇంట్లోంచి వెళ్లిపోయి శాన్జోస్లో ఉండే మేనమామ ఇంట్లో ఉంటూ వాల్మార్ట్లో పనిచేస్తోంది. తన కొడుకుని వదిలేసి పోయిన కోడలుపై మామ శీతల్ సింగ్ కోపం పెంచుకున్నడు. ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి, మాట్లాడాలంటూ బయటకు తీసుకొచ్చిండు. ఆపై తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు బులెట్లు తగలడంతో గురుప్రీత్సింగ్ అక్కడికక్కడే చనిపోయింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని శుక్రవారం పట్టుకున్నారు. కొడుకుని వదిలేసిందన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు శీతల్ సింగ్ ఒప్పుకున్నాడని వెల్లడించారు.