నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 97 బైకులు, 27 ఆటోలు స్వాధీనం

నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 97 బైకులు, 27 ఆటోలు స్వాధీనం

గంజాయి, కల్తీకల్లును సమూలంగా నిర్మూలిద్దామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. స్ధానిక వైయస్సార్ నగర్ లో  పోలీసు కమ్యూనిటీ అండ్ కాంట్రాక్టు ప్రోగ్రాంలో వారు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 97 బైక్ లు,27 ఆటోలు, ఒక కారు,3 వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

కాలనీలోని యువత గంజాయిని సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఎస్పీ. దీన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించాలన్నారు.హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతున్న పలువురిని సన్మానించారు.కాలనీల్లో గంజాయి, కల్తీకల్లును నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేశారు ఎస్పీ జానకి షర్మిల.