మహిళను వేధించిన కోర్టు ఉద్యోగిపై కేసు

మహిళను వేధించిన కోర్టు ఉద్యోగిపై కేసు

జీడిమెట్ల, వెలుగు : విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కోర్టు ఉద్యోగిపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్​పల్లి కోర్టులో ఓ మహిళకు చెందిన విడాకుల కేసు నడుస్తోంది.

ఈ కేసు విషయమై ఆమె కోర్టుకు వచ్చి  వెళ్తుండేది. మంగళవారం సదరు మహిళ కోర్టుకు వచ్చిన సమయంలో అక్కడ పనిచేసే ఉద్యోగి నరేశ్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు జగద్గిరిగుట్ట పీఎస్ లో కంప్లయింట్ చేసింది. పోలీసులు నరేశ్​పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.