చెట్ల కొమ్మలు నరికిన రైతుకు రూ.23 వేల ఫైన్

చెట్ల కొమ్మలు నరికిన రైతుకు రూ.23 వేల ఫైన్

తల్లాడ, వెలుగు: చెట్ల కొమ్మలు నరికినందుకు ఓ రైతుకు రూ.23 వేల ఫైన్ విధించారు. తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రహదారి వెంట ఉన్న ఫారెస్ట్, ఆర్ అండ్ బీకి సంబంధించిన చెట్లు ఉన్నాయి. వీటి కొమ్మలను అదే గ్రామానికి చెందిన రైతు పగిళ్ల కోటేశ్వరరావు నరికేశాడు. ఎఫ్​ఆర్​వో అరవింద్​ సూచనతో గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేశ్​ రూ.23,026 ఫైన్​ విధించారు. ఈ మొత్తాన్ని రైతు చెల్లించారు.