దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్​కు టిక్కెట్ ఇవ్వొద్దు

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్​కు  టిక్కెట్ ఇవ్వొద్దు
  •     చందంపేట మండలం తెల్దేవర్​పల్లిలో అసమ్మతి వర్గీయుల సమావేశం

దేవరకొండ(చందంపేట),వెలుగు :  బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే  రవీంద్రకుమార్​కు నియోజకవర్గంలో అసమ్మతి పోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో రవీంద్రకుమార్​కు టిక్కెట్ ఇవ్వవద్దని అధిష్టానాన్ని అసమ్మతి వర్గీయులు కోరారు. మంగళవారం చందంపేట మండలం తెల్దేవర్​పల్లి గ్రామంలో టిక్కెట్ ఆశిస్తున్న మండలి చైర్మెన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి వర్గీయుడు వడ్త్య దేవేందర్​నాయక్​ ఆధ్వర్యంలో  మండల బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే  కార్యకర్తలను అవమానాలకు గురి చేస్తున్నారని, దీంతో పార్టీకి దూరమయ్యే పరిస్ధితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

రవీంద్రకుమార్​కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఆయన గెలుపు కోసం  ఎవరూ కూడా పని చేసే పరిస్ధితులు లేవని స్పష్టం చేశారు.వడ్త్య దేవేందర్​నాయక్​కు పార్టీ టిక్కెట్​ ఇస్తే గెలిపించి అసెంబ్లీకి పంపుతామని నాయకులు తీర్మానం చేశారు. తాము చేసిన తీర్మానాన్ని  అధిష్టానానికి పంపుతామని నాయకులు చెప్పారు.  సమావేశంలో దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్​యాదవ్​,  రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య,  లక్ష్మణ్​నాయక్​,మహాలచ్చయ్య,జైపాల్​రెడ్డి,  బిక్కునాయక్​,మురుపునూతల సర్పంచ్​ వీరారెడ్డి,తెల్దేవర్​పల్లి సర్పంచ్​ పాపానాయక్​,   మాజీ సర్పంచ్​ రవి, సుక్కునాయక్​,తిరుపతయ్య,భరత్, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు  పాల్గొన్నారు.