ఆటో కాదు అంబులెన్స్

ఆటో కాదు అంబులెన్స్

తమిళనాడులోని నీలగిరి కొండల గురించి అందరికీ తెలిసిందే. మంచి టూరిస్ట్​ ప్లేస్​. కానీ, అక్కడ  ఉండేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొవిడ్​ సెకండ్​ వేవ్​ తర్వాత వాళ్లకి హెల్త్​ ప్రాబ్లమ్స్​ మరీ ఎక్కువయ్యాయి. సరైన ట్రీట్​మెంట్​ అందక, హాస్పిటల్స్​ అందుబాటులో లేకపోవడం చూసి చలించిపోయింది అక్కడ కేఫ్​ నడుపుతున్న రాధికా. కొవిడ్​ సెకండ్​ వేవ్​ అక్కడ తీవ్రంగా ఉన్న రోజులవి. ఒకామె ఉన్నట్టుండి నేల మీద పడిపోయింది. దగ్గర్లో హస్పిటల్​ లేదు. అంబులెన్స్​కు ఫోన్​ చేస్తే గంట తర్వాత వచ్చింది.  సరిగ్గా అప్పుడే రాధికకు ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే నీలగిరి ఏరియాలో  తానే సొంతంగా ఆటో అంబులెన్స్​లను డిజైన్​ చేసింది.  వాటిని డిజైన్​ చేయడానికి ముందు చాలా  స్టడీ చేసింది.  మొదట్లో ఎంతోమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడింది. వాళ్లతో కలిసి ప్రయాణం చేసింది. ఇలా చివరికి ఆటోను అంబులెన్స్​గా మార్చే ప్రాజెక్ట్​ చేపట్టింది. ఆక్సిజన్​ సిలిండర్, పేషెంట్​తో పాటు ఇద్దరు కూర్చోవడానికి రెండు సీట్లు, స్ర్టెచర్​,  మెడికల్​ ఎక్విప్​మెంట్​తో ఆటో అంబులెన్స్​ తయారుచేసింది. ఇలా ఒక్కటి కాదు మొత్తం ఆరు ఆటో అంబులెన్స్​లను  తయారు చేసి స్థానిక అంబులెన్స్​ సర్వీస్​లకు, హాస్పిటల్​కు ఇచ్చింది.ఇవి ప్రత్యేకంగా నీలగిరి ఏరియా ప్రజల కోసం అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు అంబులెన్స్​లను తయారు చేసేందుకు  సుమారు 24లక్షలు ఖర్చయ్యింది ఆమెకు.  ఈమె సేవల గురించి తెలుసుకున్న ప్రధాని కూడా ఇటీవల ఆమెను ప్రశంసించారు.