ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ విజయం ఖాయం: ఆడె గజేందర్

ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ విజయం ఖాయం: ఆడె గజేందర్

నేరడిగొండ, వెలుగు :  ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడె గజేందర్ అన్నారు. మంగళవారం బీఫామ్ అందుకొని వస్తున్న ఆయనకు నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద అభిమానులు, కార్యకర్తలు బైక్​ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

 ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడుతూ నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఫైర్​అయ్యారు. కాంగ్రెస్ నిరుపేదల పక్షాన నిలుస్తుందని, మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు.