
హనుమకొండ సిటీ, వెలుగు: ట్రైసిటీ ప్రశాంత్నగర్లోని తెలంగాణ చౌరస్తా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన ధనైరా సిల్క్ పట్టు చీరల షోరూంను నటి సుహాసిని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని చీరలను చూసి పట్టు, సిల్క్, కాటన్, బెనారస్, వెడ్డింగ్, ఫ్యాన్సీ చీరలు అతితక్కువ ధరలో ఉన్నాయని ఆమె తెలిపారు.
రూ.10వేల కొనుగోలుపై నాలుగు గ్రాముల వెండి, రూ.20 వేల కొనుగోలుపై ఎనిమిది గ్రాముల వెండి, రూ.50 వేల కొనుగోలుపై 20 గ్రాముల వెండి ఉచితంగా ఈ షోరూంలో ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో షో రూం యజమానులు భవానీ, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.