శంబాల సర్ ప్రైజ్ చేస్తుంది

శంబాల సర్ ప్రైజ్ చేస్తుంది

ఆది సాయికుమార్,  అర్చనా అయ్యర్ జంటగా   యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌‌‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న  చిత్రం ‘శంబాల’. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌‌‌‌గా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను ప్రభాస్ లాంచ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో   ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘మా ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది.  

ఈ చిత్రం  కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రంతో తాను మంచి పాత్రను  పోషించానని అర్చనా అయ్యర్ చెప్పింది.  

దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ ‘ఇది థియేటర్‌‌‌‌లో చూడాల్సిన సినిమా.  ట్విస్ట్, టర్న్స్  అన్నీ సర్​ప్రైజ్​​ చేస్తాయి. ఇందులోని  ప్రతి పాత్ర ఆడియెన్స్‌‌‌‌కి  గుర్తుండిపోతుంది’ అని అన్నాడు.   నటులు రవి వర్మ, మధు నందన్, ఇంద్రనీల్ పాల్గొన్నారు.