హైదరాబాద్, వెలుగు: రాతి యుగం నాటి నుంచి నేటి ఆధునిక కాలంలో చెలామణి అవుతున్న నాణేల వరకు అన్నీ ఒకేచోట ఉన్న మ్యూజియం సిటీలో ఉంది తెలుసా.. సైఫాబాద్లోని పాత మింట్కాంపౌండ్నే మింట్మ్యూజియంగా మార్చగా గతేడాది జూన్7న సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) సీఎండీ తృప్తి పాత్ర ఘోష్ ప్రారంభించారు. 1903 నుంచి ఇక్కడ నాణేలు తయారు చేయగా, బిల్డింగ్శిథిలావస్థకి చేరుకోవడంతో 1997లో మింట్ను చర్లపల్లికి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న మింట్కాంపౌండ్ను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగం మ్యూజియంగా మార్చారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. పెద్ద పండుగల నాడు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ మ్యూజియం తెరిచే ఉంటోంది1803లో నిజాం రాజైన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జా ముద్రించిన బంగారు నాణేలు మొదలు బ్రిటిష్ ఇండియా, జపాన్ కాయిన్స్, దేశంలో ఆయా కాలాల్లో చెలామణి అయిన కాయిన్స్అన్నీ అందుబాటులో ఉంచారు.
గోల్డ్ నుంచి సిల్వర్, నికెల్ బ్రాంజ్, స్టీల్ వరకు అన్ని రకాల కాయిన్స్ ఇక్కడ చూడొచ్చు. ఆది మానవులు కూడా నాణేలు వాడేవారని, రాళ్లనే నాణేలుగా ఉపయోగించారని మింట్మ్యూజియం సందర్శిస్తే తెలుస్తుంది. అలాగే స్వాతంత్ర్య సమరయోధుల పేర్లతో, ఇంటర్నేషనల్ యోగా డే, ఫుడ్డే నాడు రిలీజ్ చేసిన నాణేలను, భారత రత్న, పద్మ అవార్డులు, సైనిక మెడల్స్ సహా ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతూ వచ్చిందో తెలిపేలా ఎన్నోరకాల వస్తువులను ఇక్కడ సందర్శనకు ఉంచారు. నాణేల తయారీకి వాడే వస్తువులు, మెటీరియల్ను మింట్ మ్యూజియంలో చూడొచ్చు. మహనీయుల స్మారకార్థంగా వారి జయంతులు, వర్ధంతుల
సందర్భంగా ముద్రించిన నాణేలు కూడా ఉన్నాయి. అలాంటి కాయిన్స్ కావాలనుకుంటే మ్యూజియంలోనే కొనుక్కోవచ్చు. లేదా ఎస్పీఎంసీఐఎల్ వెబ్సైట్ద్వారా తీసుకోవచ్చు. అయితే అలా తయారు చేసిన కాయిన్స్ 2 వేలు మాత్రమే ఉంటాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 కాయిన్రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో కాయిన్ధర రూ.4,050 నుంచి 4,380వరకు ఉండొచ్చని మ్యూజియం అధికారులు తెలిపారు. అయితే అవి చెలామణి చేయడానికి కుదరదు. కేవలం జ్ఞాపకార్థం మాత్రమే.
అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయితే సందర్శకులు పెరగొచ్చు
ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో డైలీ 80 మంది సందర్శకులు మాత్రమే వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు ఉన్న టైంలో రోజూ 300 మంది దాకా వచ్చేవారు. ఆదివారం సహా ప్రతిరోజు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుంది. కొత్త సెక్రటేరియట్ వెనుక భాగంలో ఉండటంతో అక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభమైతే సందర్శకులు పెరుగుతారని అనుకుంటున్నాం.
- రామ్మోహన్, సీనియర్ ఇంజనీర్,
(నాణేల మ్యూజియం)