
సీఎం ఆమోదం కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూపులు
గ్రీన్సిగ్నల్ రాక ముందుకు సాగని పనులు
జనాల ఇష్యూష్తో పాటు ఉద్యోగులకు సంబంధించిన ప్రపోజల్స్ మూలకు..!
పొలిటికల్ ఇంట్రస్ట్ ఉన్న ఫైల్స్కు మాత్రం ఆగమేఘాల మీద ఆమోదం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆగమాగంగా తయారైంది. కీలక ఫైల్స్కు సీఎంవో నుంచి ఆమోదం లభించడం లేదు. వాటి కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూడాల్సి వస్తున్నది. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11 వేల ఫైల్స్ సీఎం ఆఫీసులో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. వీటిని కనీసం సీఎంచూడటం లేదని, ఆయన దగ్గరకు వెళ్లి ఫైల్స్ను టేబుల్ మీద పెట్టే ధైర్యం ఏ ఉన్నతాధికారీ చేయడం లేదని కింది స్థాయి అధికారులు అంటున్నారు. ‘‘ఈ ఫైల్ ఎందుకు తెచ్చారు” అంటూ ఓ సందర్భంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని, అప్పటి నుంచి పైఆఫీసర్లు సాహసించడం లేదని చెప్తున్నారు.
ఏవైనా ముఖ్యమైన ఫైల్స్, అవి కూడా సీఎం అడిగినవి మాత్రమే ఆయన టేబుల్పైకి వెళ్తున్నాయి. మిగిలినవి ఎక్కడ.. ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వెళ్లిన చాలా ఫైల్స్ సీఎం ఆఫీసులోని కాగితాల్లో మూలుగుతున్నాయి. వీటి గురించి కేబినెట్ సమావేశాల్లోనూ ప్రస్తావించడం లేదు.
ఫస్ట్ టర్మ్లో 10 వేల ఫైల్స్ పెండింగ్
తెలంగాణ వచ్చిన కొత్తలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇతర శాఖలు సీఎంవో సమన్వయంతో నడిచాయి. ఆ తర్వాత క్రమంగా తీరుమారిపోయింది. ఆయా శాఖల ఉన్నతాధికారులు పంపించే ఫైల్స్ సీఎంవోకి వెళ్లడమే తప్ప.. వెనక్కి రావడం ఆగిపోయాయి. ఇలా 2018లో అసెంబ్లీ రద్దు చేసిననాటికి దాదాపు 10 వేల ఫైల్స్ ఎలాంటి నిర్ణయం లేకుండానే వెనక్కి వచ్చాయి. సంబంధిత హెచ్వోడీలు సీఎం నుంచి ఏం నిర్ణయం లేదని కారణం చెప్పి వాటిని మూలకు పడేశారు. ఇప్పుడు సెకండ్ టర్మ్లోనూ సేమ్సీన్.
వాటికి మాత్రం వెంటనే క్లియరెన్స్
ఏవైనా కీలక పోస్టింగ్స్కు సంబంధించిన ఫైల్స్ గానీ, పొలిటికల్ఇంట్రస్ట్ ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ల నియామకానికి సంబంధించిన ఫైల్స్గానీ, వెంటనే ఇంప్లిమెంట్ అవ్వాలని సర్కారు పెద్దలు అనుకున్న నిర్ణయాలకు మాత్రం నిమిషాల్లో జీవోలు జారీ అవుతున్నాయి. బడా ఇండస్ట్రియలిస్టులకు ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ రిలీజెస్ వంటివి వేగంగా అయిపోతున్నాయి. ప్రైవేట్ వర్సిటీల ఫైల్స్కు ఆగమేఘాల మీద ఆమోదం లభించింది. భూముల అమ్మకానికి సంబంధించిన ఫైల్స్ ఎప్పటికప్పుడు ఓకే అయిపోతున్నాయి. కొందరు సీఎం సెక్రటరీలు తమకు ఇంట్రస్ట్ ఉన్న ఫైల్స్ను ‘‘యాజ్ ఫర్ సీఎం ఇన్స్ట్రక్షన్స్” అని నోట్ రాసి ముందుకు పంపిస్తున్నారు.
వీటికి ఆమోదమెప్పుడో?
అగ్రికల్చర్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ప్రపోజల్స్, నిర్ణయాల ఫైల్స్కు సీఎంవో నుంచి ఆమోదం లభించడం లేదు. ఇటీవల కొత్త పంటల బీమా రాష్ట్రమే అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఆ ఫైల్ సీఎంవో దాకా వెళ్లింది కానీ ఏ నిర్ణయం వెలువడలేదు. రూ. వెయ్యి కోట్ల సబ్సిడీ లోన్లకు సంబంధించి బీసీ వెల్ఫేర్ పంపిన ప్రపోజల్స్ కూ దళిత బంధు ఫై ల్స్ కూ సీఎంవో నుంచి ఆమోదం లభించడం లేదు. ఇక, రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్ర వాటా జమపై కేంద్రం ఐదారుసార్లు లెటర్ రాసింది. దీనిపై పంపిన ప్రతిపాదనకు సీఎంవో నుంచి అప్రూవల్ రావడంలేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొత్త జూనియర్, డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీల్లో మిడ్ డే మీల్స్ వంటి వాటికీ ఆమోదం లభించడం లేదు. ధరణి పోర్టల్లో మార్పులకు పదుల సంఖ్యలో ప్రతిపాదనలు వెళ్లినా స్పందన లేదని అధికారులు అంటున్నారు. సీఎంవోలో పేరుకుపోతున్న ఫైల్స్లో ఎంప్లాయీస్కు సంబంధించినవి చాలా ఉంటున్నాయి. చిన్న కారణాలతో పనిష్మెంట్ ఎదుర్కొంటున్న వాళ్లవి.. ప్రొఫెసర్ల ఏజ్ పెంపు, కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులైరేజషన్ ఇలా అనేకం పెండింగ్లోనే ఉన్నాయి. పీఆర్సీకి సంబంధించిన పదుల సంఖ్యలోని జీవోలు సీఎం అప్రూవల్ కోసం వెయిట్చేస్తున్నాయి.
జిల్లా టూర్లలో ఇచ్చిన హామీలకూ మోక్షం లేదు
బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు దాటిపోయింది. అప్పటి నుంచి సీఎం సంతకం, నిర్ణయం కోసం వెళ్లిన చాలా ఫైల్స్ముందుకు కదలడం లేదు. ఇట్లా నాలుగేండ్ల నుంచి 11 వేల వరకు ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రపోజల్స్పై కాగితాలు చేతిలో పట్టుకోవడమే తప్ప.. సీఎంకు చెప్పి అప్రూవ్ చేయించుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా టూర్లలో సీఎం కేసీఆర్ ఎక్కడైనా ఏదైనా హామీ ఇస్తే.. దానికోసం పెట్టిన ఫైల్స్ కూడా ఆమోదానికి నోచుకోవడం లేదు. ఇందులో హుజూర్నగర్, హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జున సాగర్ డెవలప్మెంట్ హామీలకు సంబంధించినవి కూడా ఉన్నాయి.