
సింగ్ వాహినీ (బీహార్ ): లాక్ డౌన్ కారణంగా పొల్యూషన్ తగ్గడంతో బీహార్ సీతామర్హి జిలాల్లోని సింగ్ వాహినీ నుంచి నేపాల్ లోని మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తోంది. ఇంటి టెర్రస్ పైన నుంచి మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తున్న ఫొటోలను గ్రామ సర్పంచ్ ట్వీట్ చేశారు. ఎప్పుడైనా వాతావరణం క్లియర్ గా ఉన్నప్పుడు నేపాల్ లోని కొన్ని కొండలు కనిపించేవని, మౌంట్ ఎవరెస్ట్ చూడటం ఇదే మొదటి సారి అని ఆమె అన్నారు. “ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటోంది”అని ట్వీట్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కుశ్వాన్ కూడా ఆ ఫొటోలను షేర్ చేశారు. బీహార్ లోని ఒక ఊరి నుంచి మౌంట్ ఎవరెస్ట్ కనిపిస్తోంది అని ట్వీట్ చేశారు.