తెలంగాణ యువ అథ్లెట్‌‌ అగసార నందిని పసిడి పరుగు

తెలంగాణ యువ అథ్లెట్‌‌ అగసార నందిని పసిడి పరుగు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ యువ అథ్లెట్‌‌ అగసార నందిని పసిడి పరుగు కొనసాగుతోంది. నేషనల్‌‌ ఓపెన్‌‌ అండర్‌‌23 అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఆమె గోల్డ్‌‌ మెడల్‌‌ కైవసం చేసుకుంది. చత్తీస్‌‌గఢ్‌‌లోని బిలాస్‌‌పూర్‌‌లో ఆదివారం జరిగిన విమెన్స్‌‌ 100 మీటర్ల హర్డిల్స్‌‌లో నందిని 13.73 సెకండ్ల టైమింగ్‌‌తో టాప్‌‌ ప్లేస్ సాధించింది.

గోల్డ్‌‌ మెడల్‌‌తో పాటు మీట్‌‌ రికార్డును కూడా బ్రేక్‌‌ చేసింది. గతేడాది ఢిల్లీలో జరిగిన టోర్నీలో అపర్నా రాయ్‌‌ 13.80సెకండ్లతో నెలకొల్పిన మీట్‌‌ రికార్డును అధిగమించింది.