
మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆమోదంతోనే డీసీసీ ప్రెసిడెంట్ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్నరేశ్ కుమార్అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ప్రెస్మీట్నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికపై బూత్, మండలం, బ్లాక్ లెవల్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు.
పార్టీ హైకమాండ్ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. తాను మూడు రోజులు మంచిర్యాలలో అందుబాటులో ఉంటానని, ఆసక్తిగలవారు దరఖాస్తు ఇవ్వాలని తెలిపారు. పీసీసీ అబ్జర్వర్అడువాల జ్యోతి, డాక్టర్ పులి అనిల్ కుమార్, గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా డీసీసీ చైర్మన్ కోసం సీనియర్నాయకులు కేవీ ప్రతాప్, గడ్డం త్రిమూర్తి, నూకల రమేశ్ దరఖాస్తు అందజేశారు..