68 ఏళ్ల తర్వాత టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా? 

68 ఏళ్ల తర్వాత టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా? 

న్యూఢిల్లీ: దేశీ విమానయానంలో కీలకంగా ఉన్న ఎయిర్ ఇండియాను దశాబ్దాల తర్వాత టాటా సన్స్ హస్తగతం చేసుకుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అప్పుల్లో ఉందనే కారణంగా ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పలు ప్రైవేట్ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఈ లిస్టులో టాటా సన్స్ ఎక్కువ బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన బిడ్‌పై ప్యానెల్ నిర్ణయాన్ని త్వరలో మీడియాకు తెలియజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

సొంత కంపెనీ తిరిగి హస్తగతం చేసుకునేనా?
ఎయిర్ ఇండియాను 1932 లో జేఆర్‌డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విమానయాన రంగాన్ని జాతీయం చేయడంతో ఎయిర్ ఇండియాలో టాటా ఎయిర్‌లైన్స్‌కు ఉన్న 49 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఆ తర్వాత కంపెనీని అప్పటి సర్కార్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది. దీంతో సంస్థ పేరును ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. 1953 లో ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. కంపెనీ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా నుంచి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీకి మళ్లీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఒకవేళ టాటా చేతికి తిరిగి ఎయిర్ ఇండియా వస్తే.. దాదాపు 68 సంవత్సరాల తర్వాత మరోసారి సొంత కంపెనీని తిరిగి పొందినట్లవుతుంది.

మరిన్ని వార్తల కోసం: 

ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?  

ఆమ్దానీ కోసం సర్కార్‌కు లిక్కరే కావాల్నా!

దేశంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ

కంటెయినర్, బస్సు ఢీ.. ఏడుగురు మృతి