
హైదరాబాద్, వెలుగు: ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ప్రారంభించింది. ఇది ఈ–మెయిల్, ఓటీటీ యాప్లు, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే మోసపూరిత వెబ్సైట్లను గుర్తించి నిరోధిస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీలతో ఈ సొల్యూషన్ను తయారు చేశామని తెలిపింది.
ఫిషింగ్ దాడులు, మాల్వేర్ వ్యాప్తి చేసే వెబ్సైట్లను, ఇతర హానికరమైన లింక్లను బ్లాక్ చేస్తుంది. ఎయిర్టెల్ నెట్వర్క్లోనే కాకుండా, ఇతర నెట్వర్క్ల ద్వారా వచ్చే మోసపూరిత లింక్లను కూడా గుర్తిస్తుంది. ఈ సేవను ఉచితంగానే వాడుకోవచ్చు.