
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా అజిత్ దోవల్ తిరిగి మూడోసారి నియమితులయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా కూడా రీఅపాయింట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకం జూన్10 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వీరు ఆ పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది.
ఇద్దరికీ కేబినెట్ హోదా ర్యాంకును కేటాయించింది. ప్రధానికి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్ లను తిరిగి నియమించడానికి కూడా కేబినెట్ కమిటీ ఓకే చెప్పింది. వీరు జూన్ 10 నుంచి రెండేండ్ల పాటు విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఈ ఇద్దరు అధికారులకు భారత ప్రభుత్వ సెక్రటరీ హోదాను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.