
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్ట్ గరిష్ట స్థాయి నీటిమట్టానికి ప్రవాహం చేరుకోవడంతో మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తారు. 2 లక్షల10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఇన్ ఫ్లో విషయానికొస్తే.. 2 లక్షల 55 వేల 811 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 2 లక్షల 47 వేల 213 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 305.8626 టీఎంసీలు.
కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరుగుతున్నది. ఇటు గోదావరి బేసిన్లోనూ వరద క్రమంగా పుంజుకుంటున్నది. శ్రీరాంసాగర్ప్రాజెక్టులోకి ఒక్కరోజులోనే 6 టీఎంసీలకుపైగా నీళ్లు వచ్చి చేరాయి. కృష్ణా బేసిన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు సోర్సుల ద్వారా నీళ్లు వస్తున్నాయి. సుంకేశుల, తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుకుంటున్నది.
దీంతో పోతిరెడ్డిపాడుకు 31 వేల క్యూసెక్కులు, నాగార్జునసాగర్వైపు 1.50 లక్షల క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. మంగళవారం నాటికి ఇన్ఫ్లో మరింత పెరిగింది. వరద ప్రవాహాలు ఎక్కువగా ఉండడంతో మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి లిఫ్ట్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద క్రమంగా పెరుగుతున్నది. ఇన్నాళ్లూ ప్రాజెక్టుకు డ్రై స్పెల్కొనసాగగా.. ప్రస్తుతం 65 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
All 26 gates of Nagarjuna Sagar dam have been lifted, amid heavy inflows. @XpressHyderabad @TelanganaCMO @UttamINC #Telangana #NagarjunaSagarDam pic.twitter.com/7IIarbE4nk
— Manda Ravinder Reddy (@ravinderTNIE) July 29, 2025