అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆ పార్టీ నిర్మల్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ను బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించి, ఆయనకు నియామక పత్రం అందించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలంతా బాధపడుతున్నారన్నారు.

కేవలం రోజులకు ఐదు గంటలు మాత్రమే కరెంట్ సప్లై చేస్తున్నారని.. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణలోనూ అలాంటి దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం ఎలా మారాయో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. రైతుబంధు, ఆసరా పింఛన్లు మరింత పెంచుతామన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు.