సంగారెడ్డి, వెలుగు : బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చి ఓ ఐఐటీ ఓల్డ్ స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి సూ సైడ్ చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్లోని జోధ్ పూర్కు చెందిన మేఘ్ కపూర్ హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఎంటెక్ మెకానికల్కు సంబంధించి బ్యాక్ లాగ్ సబ్జెక్టులు రాసేందుకు సంగారెడ్డి పట్టణ శివారులో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఓ లాడ్జీలో నెల రోజులుగా ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు లాడ్జి నాలుగో ఫ్లోర్ నుంచి దూకగా స్పాట్లోనే చనిపోయాడు.
పోలీసులు బాడీని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేఘ్ కపూర్ది ఆత్మహత్యే అని సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. అయితే సూసైడ్కు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.