అలాంటి ఫ్యాన్స్ లేకపోవడమే బెటర్.. స్టార్ హీరోలకి అను చురకలు

అలాంటి ఫ్యాన్స్ లేకపోవడమే బెటర్.. స్టార్ హీరోలకి అను చురకలు

టాలీవుడ్ స్టార్ హీరోలకి చురకలు అంటించింది టాలీవుడ్ యాంకర్ అనసూయ. గత రెండు రోజులుగా విజయ్ దేవరకొండ ఫాన్స్ కి, అనసూయకి మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె.. టాలీవుడ్ టాప్ స్టార్స్ ని సైతం టార్గెట్ చేసింది. ఈ ట్వీట్ లో అనసూయ.. ఫ్యాన్స్‌ విషయంలో హీరోలు ఎందుకు జోక్యం చేసుకోరని ఆమె ప్రశ్నిస్తుంది.

"ఈ స్టార్స్ అంతా తమ ఫ్యాన్స్ పేరుతో ఎలాంటి తప్పు చేసినా నిలదీయడానికి ఏం ఆపుతుందో తెలియడం లేదు. గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది. నాకిచ్చిన పవర్‌లో నేను బాధ్యత వహిస్తున్నా, అభిమానులు, ఫాలోయింగ్‌ పోతుందని ఆలోచిస్తున్నారా? అలాంటి ఫాలోయింగ్‌ లేకుంటేనే బెటర్‌ కదండీ" అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. విజయ్‌ ఫ్యాన్స్ కి వాళ్లు కూడా తోడవ్వడంతో ఫుల్ గా రెచ్చిపోతున్నారు. అనసూయని గట్టిగా ఆడేసుకుంటున్నారు. అంతేకాదు.. అటెన్షన్‌ తనవైపు తిప్పుకునేందుకు ఆమె ఇలాంటివి చేస్తోందని, కచ్చితంగా ఈమె అటెన్షన్‌ సీకరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఇష్యూలో కొందరు నెటిజన్లు మాత్రం ఆమెకి అండగా నిలుస్తున్నారు. ఆమె బోల్డ్ గా చెబుతుంది కాబట్టే అందరికి నచ్చడం లేదని.కాకపోతే ఆమె చెప్పేదానిలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడుతున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ ఆలూ అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప2లో కీ రోల్ చేస్తోంది. అలాగే సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న విమానం మూవీలో కూడా చేస్తోంది.