దేవరకొండ లో అంగన్​వాడీల మానవహారం

దేవరకొండ లో అంగన్​వాడీల మానవహారం

దేవరకొండ/మర్రిగూడ ( చండూరు), వెలుగు : తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో రూపంలో అంగన్​వాడీ ఉద్యోగులునిరసన తెలుపుతున్నారు.  గురువారం 18 వ రోజు సమ్మెలో భాగంగా పట్టణంలోని డిండి చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్​రెడ్డి మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న అంగన్​వాడీల పట్ల మంత్రి హరీశ్​రావు అనుచిత వ్యాఖ్యాలు చేయడాన్ని ఖండించారు. 

అంగన్​వాడీల వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచి, గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం అంగన్​వాడీ టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. మర్రిగూడలో అంగన్వాడీల సమ్మెకు తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పాండురంగారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్​వాడీలు రోజుల తరబడి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.