
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం సుమారు 2 గంటల పాటు విచారించారు. యంగ్ ఇండియా ఫౌండేషన్ విరాళాలకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిన రూ. 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని, ఎవరి డైరెక్షన్ లో ఈ డబ్బులను విరాళంగా ఇచ్చారని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇదే కేసులో నిరుడు నవంబర్లోనూ అంజన్ కుమార్ ఈడీ ముందు హాజరయ్యారు. ఇటీవల ఈడీ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీసు ‘ప్రవర్తన్ భవన్’లో విచారణకు హాజరయ్యారు. అనంతరం అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... తానేమీ తప్పు చేయలేదని అన్నారు.