కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అనుష్క కోహ్లీ

కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అనుష్క కోహ్లీ

దేశంలో క్రికెట్కు..సినిమాకు విడదీయరాని సంబంధం ఉంది. అభిమానులు..సినిమాను ఏ విధంగా ఇష్టపడతారో..క్రికెట్ను కూడా అదే విధంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా క్రికెటర్లు..సినిమా స్టార్ల కలయికను ఫ్యాన్స్ ఆమోదిస్తారు. అందుకే దేశంలో క్రికెటర్లు, సినిమా హీరోయిన్లను హీరోయిన్లను వివాహం చేసుకున్న సందర్భాలు అనేకం.  వారంతా అన్యోన్యంగా తన వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అనుష్క కోహ్లీ జంట కూడా ఈ కోవలోకే వస్తుంది. వీరిద్దరు తమ వృత్తుల్లో రాణిస్తూనే..భార్యభర్తలుగా ఫుల్ చిల్ అవుతూ ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా వెకేషన్కు వెళ్తూ..ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా విరుష్క జంట..యూకేలో ఎంజాయ్ చేసింది.

కాఫీ తాగుతూ...
ఆసియాకప్ 2022 ముగియడంతో..కోహ్లీ వెకేషన్కు చెక్కేశాడు. అనుష్క శర్మ లండన్లో తన తర్వాత చిత్రం చక్దా ఎక్స్ ప్రెస్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ అనుష్క చెంతకు చేరాడు. షూటింగ్ ముగిసిన తర్వాత వీరిద్దరు రోడ్ సైడ్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేశారు. రొమాంటిక్గా కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఫొటోలను  అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. కూతురు వామికతో ఆడుకునేందుకు అనుష్క పార్క్కి వెళ్లిన దృశ్యాలని కూడా ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 

చెలరేగిన కోహ్లీ..
ఆసియకప్కు ముందు ఫాం లేమితో తంటాలు పడిన కోహ్లీ..టోర్నీలో మాత్రం సత్తా చాటాడు. అత్యధిక పరుగులు సాధించాడు. 5 మ్యాచుల్లో 5 ఇన్నింగ్స్ లు ఆడి 92 సగటుతో 276 పరుగులు చేశాడు.  ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. అయితే టీమిండియా మాత్రం ఆసియాకప్లో ఘోరంగా ఓడిపోయింది. గ్రూప్ 4లో పాక్, లంక చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.