ఏపీలో వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లు డబుల్ అయ్యాయి. ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు అందుకున్న వాళ్లు ఇక రూ.2 వేలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని చెప్పారు. జనవరి నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఈ నెలలో ఇప్పటికే రూ. వెయ్యి చొప్పున ఫించన్లు ఇచ్చేసినందున మిగతా వెయ్యిని ఫిబ్రవరిలో కలిపి ఇస్తామని తెలిపారు. అంటే ఫిబ్రవరిలో వృద్ధులు, వితంతువులు మొత్తం 3 వేల రూపాయలు పింఛన్ గా అందుకుంటారు. మార్చి నుంచి రూ.2 వేలు చేతికందుతుంది. 2019 ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Andhra Pradesh CM N Chandrababu Naidu announces enhancement of the old age pensions from Rs. 1000 to 2000 from January. pic.twitter.com/NPXkeyrJRF
— ANI (@ANI) January 11, 2019