ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేలు సాయం

 ఆటో, క్యాబ్  డ్రైవర్లకు పదివేలు సాయం

ఏపీలో వరుసగా మూడో ఏడాది YSR వాహనమిత్ర లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, క్యాబ్  డ్రైవర్లకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నెల రోజుల ముందుగానే ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామన్నారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి 2 లక్షల 48 వేల మందికి 248 కోట్ల నగదు జమ చేశారు. దేశంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది ఒక్క ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు జగన్. వైఎస్ఆర్  వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు. ప్రభుత్వంపై టీడీపీ నేతల విమర్శలను కొట్టిపారేశారు జగన్. టీడీపీ హయాంలో వాహనాలపై భారీగా పెనాల్టీలు విధించారని మండిపడ్డారు.