ఏపీలో పరీక్షలపై తొలి నుంచి ఒకే స్టాండ్

 ఏపీలో పరీక్షలపై తొలి నుంచి ఒకే స్టాండ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై తొలి నుంచి తాము ఒకే మాటపై ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామని.. అయితే పరిస్థితులు కొలిక్కి వచ్చాక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్ తో సమీక్ష ముగిసిన అనంతరం ఆయన బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. జులైలో జరపాలని భావిస్తున్నపరీక్షల టైంటేబుల్, షెడ్యూల్ గురించి ఇవాళ సీఎం జగన్ వద్ద జరిగిన సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టుల నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదని.. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.