ఏపీలో మటన్ మార్ట్ లు

ఏపీలో మటన్ మార్ట్ లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్ట్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నాలుగు చొప్పున మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మార్ట్ లను విస్తరించనున్నారు. మొత్తం రూ. 11.20 కోట్లతో 112 మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు.

ఆరోగ్యకరమైన మాంసాన్ని వినియోగదారులకు అందించేందుకు మార్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో పరిశుభ్రమైన వాతావరణంలో మాంసం అమ్మకాలు జరుగుతాయంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మద్యం షాపులను నేరుగా నిర్వహిస్తోంది. ఇప్పుడు మాంసం అమ్మకాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది.