ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఆమదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తమ్మినేని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కూడా కబడ్డీ ప్లేయర్ అయ్యారు. ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు. ఉత్సాహంగా ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కాలు జారి కిందపడిపోయారు. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించి ఆయనను లేవనెత్తారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వార్తల కోసం...
