AP: 10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో

AP: 10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో

ప్రకాశం జిల్లా: ఒంగోలు మండలం  ముక్తినూతలపాడు వీఆర్వో పి.రమాదేవి  బుధవారం 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఒక రైతుకు చెందిన 26 సెంట్ల పొలము మ్యూటేషన్ మరియు పట్టాదారు పాస్ బుక్ జారీ చేయడం కోసం లంచం డిమాండ్ చేసింది. తొలుత 12వేలు ఇమ్మని కోరిన వీఆర్వో చివరకు రూ.10వేలు తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో బాధితుడు నేరుగా వెళ్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

బుధవారం ఒంగోలు ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చిన వీఆర్వో రమాదేవికి ఫోన్ చేయగా.. ఆఫీసులోనే ఉన్నాను రమ్మని సమాచారం ఇచ్చింది. బాధితుడు వెళ్లి వీఆర్వో రూమ్ లో ఉన్న రమాదేవికి రూ. 10000 రూపాయలు ఇవ్వగా తీసి పెట్టుకుంది. ఒంగోలు ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డి.ఎస్.పి ఎం. సూర్యనారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీమతి అపర్ణ, వెంకటేశ్వర్లు, శేషు వారి సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.