యూపీ సర్కారుకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ‘కూతురు ట్రీట్మెంట్కు డబ్బు లేక కుటుంబంతో సహా చనిపోయేందుకు అనుమతివ్వాలని ఓ తండ్రి కోరుతున్నాడంటే సమాజానికి సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నిర్భాగ్య తండ్రిని ఆదుకోవాలి’ అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఆగ్రా జిల్లాలోని పూరా లోధి గ్రామానికి చెందిన సుమర్సింగ్ కూతురు లలిత(17) అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతోంది. రోజు కూలీతో బతికే సమర్సింగ్ కూతురి ట్రీట్మెంట్కు ఉన్న కొద్దిపాటి భూమినీ కుదువపెట్టి హాస్పిటల్కు చెల్లించాడు. వారం వారం రక్త మార్పిడికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుండడం, మొత్తం ట్రీట్మెంట్కు పది లక్షల వరకు కావాలని డాక్టర్లు తేల్చిచెప్పడంతో.. కూతురును బతికించండి లేదా తమ కుటుంబం చనిపోయేందుకు అనుమతించాలని సమర్సింగ్ కోరుతున్నాడు.