డిగ్రీతో మారిన పోటీ

డిగ్రీతో మారిన పోటీ

గ్రూప్​–4 పోస్టులకు  అప్లికేషన్​ ప్రాసెస్​ మొదలైంది. మొత్తం 8,068 పోస్టులకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది  ఏప్రిల్​/ మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​లో పేర్కొంది. పోస్టులు తక్కువ, తీవ్రమైన పోటీ, నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది. ప్రణాళిక ప్రకారం సిలబస్​ను విభజించుకొని చదివితే విజయం సాధించవచ్చు.

మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్​–1 జనరల్​ స్టడీస్​, పేపర్​–2 సెక్రటేరియట్​ ఎబిలిటీ.  జనరల్​ స్టడీస్ సిలబస్​​లో మొత్తం 11 అంశాలు ఉన్నాయి. అవి.. కరెంట్​ అఫైర్స్​, అంతర్జాతీయ సంఘటనలు, కార్యక్రమాలు, నిత్య జీవితంలో సైన్స్​, విపత్తుల నిర్వహణ, పర్యావరణ అంశాలు, భారత​, తెలంగాణ జాగ్రఫీ, భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు.

కరెంట్​ అఫైర్స్​ కీలకం

పోటీ పరీక్ష ఏదైనా కరెంట్​ అఫైర్స్​ చాలా కీలకం. కొన్ని సమయాల్లో విజయావకాశాలనూ నిర్ణయిస్తుంది. కాబట్టి కరెంట్​ అఫైర్స్​పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఎగ్జామ్​ తేదీకి 9 నెలలు వెనుక నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. గరిష్ఠంగా ఏడాదికాలం కరెంట్​ అఫైర్స్​ ప్రిపేర్​ కావడం మేలు. ఇంటర్నేషనల్​ అఫైర్స్​, ఈవెంట్స్​లో వివిధ దేశాలతో భారత్​కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలు, వివాదాలపై ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. గత ఏడాది కాలంలో జరిగిన ఇంటర్నేషనల్​​ ఈవెంట్స్​పై దృష్టి సారించాలి.   సిలబస్ లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ భౌగోళికం, తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, పాలనా విధానాలు, ఆర్థిక వ్యవస్థ మొదలైన టాపిక్స్​ను లోతుగా చదివితే 40 – 50 మార్కులను సులువుగా సాధించవచ్చు. 

50కి పైగా ప్రశ్నలు 

భారత రాజ్యాంగంలో పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల  నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కరెంట్​ అఫైర్స్​తో కలిపి చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం​, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలపై లోతుగా చదవాలి. ఇండియన్​ ఎకానమీలో జాతీయ ఆదాయం, నిరుద్యోగం, పేదరికం మౌలిక భావనలు చదవాలి.  ఆధునిక భారతదేశంలో జాతీయోద్యమం టాపిక్​ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గవర్నర్​ జనరల్స్​, విధానాలు, మితవాద, అతివాద యుగాలు, జాతీయోద్యమంలోకి గాంధీ ప్రవేశం, పోరాటాలను లోతుగా చదవాలి.  , ఉద్యమాన్ని నడిపిన ప్రముఖుల జీవిత చరిత్రలపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 

పేపర్​ –2  
సెక్రటేరియల్​ ఎబిలిటీస్​లో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. అవి.. మెంటల్​ ఎబిలిటీ (వర్బల్​ అండ్​ నాన్​ వర్బల్​), లాజికల్​ రీజనింగ్, కాంప్రహెన్షన్​, రీ–అరెంజ్​మెంట్​ ఆఫ్​ సెంటెన్సెస్​, న్యూమరికల్​, అర్థమెటికల్​ ఎబిలిటీస్​. కాంప్రహెన్షన్​, రీ–అరెంజ్​మెంట్​ ఆఫ్​ సెంటెన్సెస్ నుంచే 25 ప్రశ్నలు వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు ప్రత్యేకంగా ఏ పుస్తకాలూ చదవాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్​ పేరాలను వేగంగా చదవి, అర్థం చేసుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్​ పేపర్స్​తోపాటు ప్రాక్టీస్​ బిట్స్​ను ఎక్కువగా సాధన చేయాలి. గత గ్రూప్​–4 ఎగ్జామ్​లో అత్యధికంగా రీజనింగ్​ నుంచి 75 ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత అర్థమెంటిక్​ నుంచి 50 వరకు ప్రశ్నలను ఇచ్చారు. ఈ వెయిటేజీని దృష్టిలో పెట్టుకుని రీజనింగ్​ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మార్కులను స్కోర్​ చేయవచ్చు.  మెంటల్​ ఎబిలిటీ, లాజికల్​ రీజనింగ్​లో కోడింగ్​ డికోడింగ్​, రక్త సంబంధాలు, పజిల్స్​, వర్గీకరణ, ఎనాలజీ, ఎసర్షన్​ రీజన్​, వెర్బ​ నాన్​ వెర్బల్​ రీజనింగ్​ మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల్లోని లాజిక్​, పరిష్కార పద్ధతిని తెలుసుకొని వీలైనన్ని ప్రశ్నలను ప్రాక్టీస్​ చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

ఐదురకాల అర్హతలు 

గ్రూప్​–4 సర్వీసుల్లో భాగంగా 99 డిపార్ట్​మెంట్లలో 8039 పోస్టుల భర్తీకి అప్లికేషన్​ ప్రాసెస్​ మొదలైంది. టీఎస్​పీఎస్సీ నిర్వహించే ఈ సర్వీసులో జూనియర్​ అకౌంటెంట్​ (కమిషనర్​ & మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​), జూనియర్​ అసిస్టెంట్​ (ఫుడ్​ అండ్​ సివిల్​ సప్లయ్​), జూనియర్​ అసిస్టెంట్​ పీ & ఏ (హెచ్​ఎండీఏ), జూనియర్​ అసిస్టెంట్​ ఎఫ్​ & ఏ (హెచ్​ఎండీఏ), మ్యాటర్న్​/ మ్యాటర్న్​ కం స్టోర్​కీపర్​ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు సాధారణ డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.

జూనియర్​ అకౌంటెంట్​ (కమిషనర్​ & మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​) పోస్టులు : 224 
అర్హత :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్​ డిగ్రీలో ఉత్తీర్ణత.
జూనియర్​ అసిస్టెంట్​ (ఫుడ్​ అండ్​ సివిల్​ సప్లయ్​) పోస్టులు: 46
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో  ఉత్తీర్ణత. డిగ్రీలో ఓసీ, బీసీ అభ్యర్థులు 50శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40శాతం మార్కులు సాధించి ఉండాలి. 

జూనియర్​ అసిస్టెంట్​ పీ & ఏ (హెచ్​ఎండీఏ) పోస్టులు : 100
అర్హత : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
జూనియర్​ అసిస్టెంట్​ ఎఫ్​ & ఏ (హెచ్​ఎండీఏ)
పోస్టులు : 67
అర్హత :  బీకాం (కంప్యూటర్స్​)  
మ్యాటర్న్​/ మ్యాటర్న్​ కం స్టోర్​కీపర్​ 
పోస్టులు : 28
అప్లికేషన్ ​: అర్హులైన అభ్యర్థులు డిసెంబర్​ 30 నుంచి జనవరి 30 వరకు ఆన్​లైన్​లో అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.  సమాచారం కోసం www.tspsc.gov.in
అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. 
సెలెక్షన్​ ప్రాసెస్ ​: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్​టైప్​), సర్టిఫికేట్​ వెరిఫికేషన్​, రూల్​ ఆఫ్​ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.  మూడు క్యాడర్లు 
గ్రూప్​–4లో  పోస్టుల్లో డిస్ట్రిక్​ క్యాడర్​, కాంటిజుయస్​ డిస్ట్రిక్​, స్టేట్​ క్యాడర్ గా పోస్టులు ఉన్నాయి. 
స్టేట్​ క్యాడర్​ :  627 పోస్టులు.. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో 627 జూనియర్​ అసిస్టెంట్​ పోస్టులను స్టేట్​ క్యాడర్​గా విభజించారు. వీటికి లోకల్​ రిజర్వేషన్ వర్తించదు. ఏ జిల్లాకు చెందినవారైనా అర్హులే.  
కాంటిజుయస్​ క్యాడర్​: 548 పోస్టులు..  ​ డైరెక్టర్​ ఆఫ్ ఇన్సూరెన్స్​, హెచ్​ఎండీఏలో జూనియర్​ అసిస్టెంట్​, అకౌంటెంట్​, కంట్రోలర్​ ఆఫ్​ లీగల్​ మెట్రలాజీ, డైరెక్టర్​ ఆఫ్​ సైనిక్​ వెల్ఫేర్​, జీహెచ్​ఎంసీ, కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ, కమిషనర్​ ఆఫ్​ ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​లోని 548 పోస్టులు ఉన్నాయి. వీటికి సమీప జిల్లాలకు చెందిన అభ్యర్థులూ అర్హులే. 
డిస్ట్రిక్​ క్యాడర్​: 6862 పోస్టులు: స్టేట్​ క్యాడర్​, కాంటిజుయస్​ డిస్ట్రిక్​ పోస్టులు మినహా మిగిలిన 6862 పోస్టులను డిస్ట్రిక్​ క్యాడర్​లో భాగంగా భర్తీ చేయనున్నారు. వీటి ఆయా జిల్లాల లోకల్​ అభ్యర్థులు మాత్రమే అర్హులు.