న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ఆరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ నెల 19న (సోమవారం) విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేజ్రీవాల్కు ఈడీ ఇంతకుముందు ఐదు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఏ ఒక్క సమన్లకూ ఆయన స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ విచారించిన కోర్టు.. వచ్చే శనివారం కోర్టు కు హాజరు కావాలని కేజ్రీవాల్ను ఆదేశిం చింది. గతంలో జారీ చేసిన ఐదు సమన్లకు ఎందుకు స్పందించలేదో తెలపాలని సూచించింది. ఈ లోపే ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేసింది. కాగా.. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. శనివారం హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.