ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ఆటగాళ్ల వేలం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 8,9వ తేదీల్లో ముంబైలో వేలం జరగాల్సింది. ఇండియా జట్లు ఆసియా గేమ్స్లో పోటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాయిదా వేసినట్టు ఆర్గనైజర్లు శనివారం ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
