హైదరాబాద్, వెలుగు: సైబర్ సెక్యూరిటీ - సవాళ్లు, అవకాశాల’పై అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) బుధవారం నిర్వహించింది. పెరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించడానికే ఈ ప్రయత్నమని సంస్థ తెలిపింది. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ ‘‘ సైబర్ నేరాలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి.
సైబర్ క్రైమ్స్ కారణంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 10.50 ట్రిలియన్ల నష్టం జరుగుతుందని అంచనా. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియాపై ప్రభావం ఉంటుంది” అని అన్నారు. రాష్ట్ర ఐటీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్, ఓఎస్డీ రమాదేవి మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ రంగంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీలను స్వీకరించాలని సూచించారు. ఐఐటీ హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ ముప్పు తగ్గించడానికి చేపడుతున్న చర్యలను వివరించింది.