ఇది నిజమేనా..: అంబానీ ఇంట్లో.. టిష్యూ పేపర్లగా రూ.500 నోట్లు

ఇది నిజమేనా..: అంబానీ ఇంట్లో.. టిష్యూ పేపర్లగా రూ.500 నోట్లు

మామూలుగా సెలబ్రెటీల ఇళ్లల్లో పెళ్లిల్లు, ఫంక్షన్లు అంటేనే ఆకట్టుకునేలా డెకరేషన్, వెరైటీ వంటలు.. ఇలా చెప్తూ పోతే చాలానే ఉంటాయి. ఇక ఆసియాలోని అత్యంత కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అరెంజ్డ్ పార్టీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే వారి ఇంట్లో ఓ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ పార్టీలో టిష్యూ పేపర్లకు బదులుగా రూ.500 నోట్లు వడ్డించారంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఓ ట్వీట్ ను రత్నీష్ అనే పేరుతో ఉన్న అడ్మిన్ షేర్ చేశారు. దాంతో పాటు  అంబానీల పార్టీలో టిష్యూ పేపర్లకు బదులు కరెన్సీ నోట్లను వడ్డించారు అంటూ ఓ ఫుడ్ ఐటమ్ ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒక జోక్ అని తమకు తెలుసంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశారు. దీన్ని దౌలత్ చాట్ అంటారని, ఇది ఢిల్లీలోని "ఇండియన్ యాక్సెంట్" అనే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ లో ఫేమస్ ఫుడ్ ఐటమ్ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో ట్విట్టర్ లో షేర్ అవుతోన్న పోస్ట్.. కేవలం రూమర్ అని స్పష్టమవుతోంది. కానీ ముందు ట్వీట్ చూసిన వారంతా నిజంగానే అంబానీల పార్టీల్లో టిష్యూ పేపర్లకు బదులు రూ.500నోట్లను వడ్డించారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/LoyalSachinFan/status/1642396944302759936