
న్యూఢిల్లీ : హెచ్ఐవీ-–1 ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కోసం జెనరిక్ డ్రగ్ను మార్కెట్ చేయడానికి యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందినట్లు అరబిందో ఫార్మా బుధవారం తెలిపింది. 600 ఎంజీ, 800 ఎంజీ డోసుల్లో డారునవీర్ మాత్రలను తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి తుది ఆమోదం పొందామని హైదరాబాద్కు చెందిన ఈ డ్రగ్ మేకర్ తెలిపింది.
కంపెనీ ప్రొడక్ట్ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ ప్రెజిస్టా టాబ్లెట్లు, 600 ఎంజీ 800 ఎంజీ డోసులకు సమానం. ఈ ఉత్పత్తిని బుధవారం విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐక్యూవీఐఏ డేటా ప్రకారం, ఈ డ్రగ్ మార్కెట్ సైజు అక్టోబర్ 2023తో ముగిసిన 12 నెలలకు 274.8 మిలియన్ల డాలర్లు ఉంది.