
అడిలైడ్: భారీ విజయంతో రన్రేట్ పెంచుకొని టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరుకోవాలన్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. చిన్న జట్టు అఫ్గానిస్తాన్పై అతి కష్టంగా గెలిచింది. అఫ్గాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ (23 బాల్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 నాటౌట్) మెరుపు బ్యాటింగ్తో ఆతిథ్య జట్టును వణికించాడు. చివరి ఓవర్లో అఫ్గాన్కు 22 రన్స్ అవసరం అవగా.. రషీద్ 17 రాబట్టగలిగాడు. దాంతో, ఆసీస్ 4 పరుగుల తేడాతో గట్టెక్కి సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. సూపర్12, గ్రూప్1లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఆసీస్ 20 ఓవర్లలో 168/8 స్కోరు చేసింది.
మ్యాక్స్వెల్ (32 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్) ఫిఫ్టీ కొట్టగా.. మిచెల్ మార్ష్ (45), వార్నర్ (25), స్టోయినిస్ (25) రాణించారు. ఛేజింగ్లో అఫ్గాన్ 20 ఓవర్లలో 164/7 స్కోరు చేసి ఓడింది. చివరి 18 బాల్స్లో అఫ్గాన్కు 49 రన్స్ అవసరమైన దశలో రషీద్ ఫోర్లు, సిక్సర్లతో అనూహ్యంగా రెచ్చిపోయాడు. కానీ, ఆఖరి ఓవర్లో 22 రన్స్ రాబట్టలేకపోవడంతో ఆసీస్ ఊపిరిపిల్చుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన ఆసీస్ 7 పాయింట్లతో (-–0.173 రన్రేట్)తో న్యూజిలాండ్ తర్వాత రెండో ప్లేస్లో ఉంది కివీస్ (7 పాయింట్లు; 2.113 రన్రేట్)కు ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం అవగా.. మెరుగైన రన్రేట్తో ఉన్న ఇంగ్లండ్ (5 పాయింట్లు; 0.547 రన్రేట్) శనివారం శ్రీలంకపై గెలిస్తే ఆసీస్ను వెనక్కునెట్టి సెమీస్ చేరుకుంటుంది. కాగా, ఈ టోర్నీలో అఫ్గాన్ గెలుపు రుచి చూడలేదు. ఐదు మ్యాచ్ల్లో మూడు ఓడగా, మరో రెండు రద్దయ్యాయి. జట్టు చెత్తాటకు బాధ్యతగా అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ కెప్టెన్సీకి రిజైన్ చేశాడు.