అద్భుత జలపాతాలు.. బయ్యారం అడవుల సొంతం

అద్భుత జలపాతాలు.. బయ్యారం అడవుల సొంతం

చుట్టూ కొండలు.. పచ్చని అటవీప్రాంతం.. కనువిందు చేసే అందమైన జలపాతాలు.. బయ్యారం అడవులసొంతం. బయ్యారంలోని మిర్యాలపెంటలోసహజ సిద్ధంగా పాండవుల గుట్టపై ఏర్పడినఏడుబావుల జలపాతం పర్యాటకులనుకనువిందు చేస్తోంది. ఒక బావి నుంచి మరోబావిలోకి ప్రవహిస్తున్న నీటితో ఈ బావులు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

సహజ సిద్ధంగా.. ఎత్తైన గుట్టల నడుమ..దట్టమైన అభయారణ్యంలో అద్భుత జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.ఎత్తైన శ్రేణుల పైనుంచి ఏడు వరుసలుగాపారుతున్న నీరు జలపాతాలుగా ఆవిష్కృతమై ఆహ్లాదాన్ని పంచుతుంది. బయ్యారం నుంచి రోడ్డు మార్గం ద్వారా జగ్రావ్ పేట,కంబాలపల్లి మీదుగా మిర్యాల పెంటకు చేరుకోవాలి. అక్కడ నుంచి కొద్ది దూరం నడిస్తే ఏడు బావులు దర్శనమిస్తాయి.గుట్టల పై భాగాన ఒక బావి నుంచి మరోబావి, ఆ బావి నుంచి ఇంకో బావికి జలధార పరవళ్లు తొక్కుతోంది. ఒకదాని తర్వాతఒకటి.. వరుసగా ఉండటం, గుట్టపై నుంచి ప్రవహించే ప్రవాహం వల్ల ఆయా ప్రదేశాల్లో రాతిపొరలు కోతకు గురై ఏడు బావులుగాఏర్పడ్డాయనే అభిప్రాయం ఉంది.పరవళ్లు తొక్కు తూ నీళ్లన్నీ సెలయేరులా ఏర్పడి కనువిందు చేస్తాయి.ఇక్కడి అడవి అందాలు, పక్షుల కిలకిల రావాలు, అరుదైన వన్యప్రాణులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ ఏడు బావుల్లోకి నీరు ఎక్కడ్నించి వచ్చిచేరుతుందనేది ఇప్పటికీ రహస్యమే. దేవతలకాలంలో పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ బావులను తవ్వించినట్లు, అందులో స్నానాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఏడు బావుల్లో వర్షపు నీరు వచ్చి చేరినా.. కలుషితం కాదు. స్వచ్ఛమైన పాలలాంటి నురగలను తలపిస్తాయి.ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే తెలంగాణ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. నీటి అందాలను తిలకించి మైమరిచి పోతుంటారు. ఈ ఏడు జలపాతాల్లోఐదు జలపాతాలు వంద అడుగులకు పై నుంచి కిందకు పడుతూ కనువిందు చేస్తున్నాయి.సుమారు 900 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు కిందికి పడుతుంటాయి.వీటిని చూడాలంటే పర్యాటకులు పర్వతాన్నిఅధిరోహించక తప్పదు. సుమారు నాలుగు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో కాలిబాటన ప్రయాణిస్తే ఈ జలపాతాలు కనిపిస్తాయి.