ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

మంచిర్యాల/జైపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​బదావత్​ సంతోష్ ​సూచించారు. గురువారం జైపూర్ మండలం ఇందారం వద్ద ఏర్పాటు చేసిన అంతర్​ జిల్లా చెక్​పోస్టును డీసీపీ సుధీర్ రాంనాథ్​ కేకన్, మంచిర్యాల ఆర్డీవో రాములుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రిజస్టర్లు, రికార్డులను పరిశీలించారు. చెక్​ పోస్టుల దగ్గర అన్ని వెహికల్స్​ను చెక్​ చేయాలని.. ఆధారాలు లేని నగదు, బంగారం, ఇతర సామాగ్రి పట్టుబడితే సీజ్​ చేయాలన్నారు. మంచిర్యాల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను డీసీపీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్​ల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు.