క్వార్టర్స్‌‌‌‌లో ట్రిసా–గాయత్రి జోడీ

క్వార్టర్స్‌‌‌‌లో ట్రిసా–గాయత్రి జోడీ

లక్నో: ఇండియా యంగ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ జోడీ ట్రిసా జోలీ–గాయత్రీ గోపీచంద్​. సయ్యద్‌‌‌‌ మోదీ ఇంటర్నేషనల్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీలో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ట్రిసా–గాయత్రి 21–9, 21–5తో ధన్యా నందకుమార్‌‌‌‌–రిధి కౌర్‌‌‌‌ తూర్‌‌‌‌ (ఇండియా)పై గెలిచారు. 

మరో మ్యాచ్‌‌‌‌లో అశ్విని పొనప్ప–తానీషా క్రాస్టో 22–20, 17–21, 21–16తో రుతాపర్ణ–శ్వేతపర్ణ పండాపై గెలిచారు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సుమిత్‌‌‌‌ రెడ్డి–సిక్కి రెడ్డి 9–21, 17–21తో కోయ్‌‌‌‌ యమషితా–నరు షినోయా (జపాన్‌‌‌‌) చేతిలో ఓడారు. 

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ప్రియాన్షు రజావత్‌‌‌‌ 21–18, 11–6తో సతీష్‌‌‌‌ కుమార్‌‌‌‌పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌తో గద్దె రుత్వికా శివాని 8–21, 12–21తో లాలిన్రత్‌‌‌‌ చైవాన్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌) చేతిలో ఓడింది.