బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ2 : తాండవం’ (Akhanda2:Thaandavam). ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. రేపు శుక్రవారం (2025 డిసెంబర్ 5న) పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ చేసింది.
‘అఖండ2’ టీం ప్రత్యేక అభ్యర్థన మేరకు.. విడుదలకు ముందు రోజు అంటే.. ఇవాళ (డిసెంబర్ 4) నుంచే స్పెషల్ షోకి పర్మిషన్ వచ్చింది. ఈ క్రమంలో అఖండ 2 ప్రీమియర్ షో రాత్రి 8 గంటలకు పడనుంది. దీన్ని టికెట్ ధర రూ.600లుగా (+GST) నిర్ణయిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
►ALSO READ | Balakrishna: 'అఖండ 2'లో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు..
అలాగే, మూవీ విడుదలైన రోజు నుండి అంటే.. డిసెంబర్ 5 నుండి 7 వరకు (3 రోజులు) పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.100 (GST సహా) పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. అయితే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఓ స్పెషల్ కండిషన్ పెట్టింది.
పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మొత్తాన్ని FDC పర్యవేక్షణలో ప్రత్యేక ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే, థియేటర్లలో డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అవగాహన ప్రకటనలు తప్పనిసరి అని ప్రభుత్వం జీవో ద్వారా వెల్లడించింది. ఇకపోతే.. ఈ స్పెషల్ షో అనుమతితో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.
