దేశంలో పలుచోట్ల కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకరం అని భావించే కుక్క జాతులపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కుక్కల్ని దిగుమతి చేసుకోవడం, విక్రయించడం, బ్రీడింగ్ చేయడంపై నిషేధం విధించాలని తేల్చి చెప్పింది. ఈ లిస్ట్లో మాస్టిఫ్స్, రోట్వీలర్, పిట్బుల్, టెర్రియర్ సహా మొత్తం 23 రకాల శునకాలున్నాయి.
ఇవి ప్రమాదకరమైనవి, దాడి చేస్తే ప్రాణాలకే ముప్పు అని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ లిస్ట్ లో ఉన్న కుక్కల్ని ఉప్పటివరకు పెంచుకోవడానికి ఇచ్చిన లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కుక్కల దాడులు పెరుగుతున్న క్రమంలోనే యానిమల్ వెల్ఫేర్ గ్రూప్స్కి చెందిన నిపుణులతో కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
నిషేధం విధించిన కుక్కల జాతులు
పిట్బుల్
టోసా ఇను
అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెరియర్
ఫిలా బ్రసిలేరియో
డోగో అర్జెంటీనో
అమెరికన్ బుల్డాగ్
బోస్బోల్
కంగల్
సెంట్రల్ ఏషియన్ షెఫర్డ్ డాగ్
ఇంకా కొన్ని జాతులు (మొత్తం 23 రకాల జాతులు)