కేసీఆర్ బెదిరింపులకు భయపడే 11 వేల మంది రైతులు ఆత్మహత్య : సంజయ్

కేసీఆర్ బెదిరింపులకు భయపడే 11 వేల మంది రైతులు ఆత్మహత్య : సంజయ్

రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా.. వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంజయ్​ అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్యవసాయం రంగం నిజంగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి పైగా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పా లన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని ​విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులను  బీఆర్ఎస్ పార్టీ అరిగోస పెడితే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఫైర్​అయ్యారు.