బషీర్బాగ్, వెలుగు: వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాథ్పై హైదరాబాద్లోని రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూల్స్ పాటిస్తున్న మిల్లులపై వివక్ష చూపుతూ మిషనరీ, కరెంట్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. డీసీఎస్వోపై గతంలో కలెక్టర్, విజిలెన్స్ డీజీ, సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించినట్లు చెప్పారు.
