
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. నవంబర్ 18న తొలి టీ20, 20న రెండో టీ20, 22న మూడో టీ20 జరగనన్నాయి. నవంబర్ 25నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ ), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కిపర్ ), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ , అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ ),శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కిపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజువేంద్ర చాహల్ ,కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ మరియు ఉమ్రాన్ మాలిక్.
మరోవైపు బంగ్లాదేశ్తో వన్డేలు, టెస్టు సిరీస్ లకు కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. డిసెంబర్లో బంగ్లాదేశ్తో మూడు వన్డే మ్యాచ్లు, రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లను టీమిండియా ఆడనుంది.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్ ), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, డబ్ల్యూ సుందర్, శార్దూల్ ఠాకూర్ , షమీ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్ ), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.