పేద విద్యార్థినికి అండగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి

పేద విద్యార్థినికి అండగా నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి

పేద విద్యార్థినికి అండగా నిలిచారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంలోని గొల్లగూడకు చెందిన బోడ అమృత వర్శిని.. ఫైలెట్ గా సెలక్టయింది. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్న అమృత వర్శిని... ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని పరిస్థితిలో ఉంది. చదువు పూర్తి చేయాలంటే 6 లక్షల రూపాయలు అవసరం. ఈ విషయం తెలుసుకున్న.... ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థినికి అండగా నిలిచారు. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. విద్యార్థిని చదువు పూర్తయ్యే వరకు ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తమ బిడ్డ పైచదువులు కొనసాగించేందుకు సాయం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి.. అమృత, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.