కెనడాలో బొప్పాపూర్​వాసి మృతి

కెనడాలో బొప్పాపూర్​వాసి మృతి

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్భర్​పేట, భూంపల్లి మండలం బొప్పాపూర్​ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మిబాయి రాజేశ్వరావు దంపతుల కుమారుడు ప్రవీణ్​రావు(42) కెనడాలో అనారోగ్యంతో బుధవారం మరణించారు. ప్రవీణ్​ రావు పదో తరగతి వరకు దుబ్బాక మండలం ఆకారం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్​లో చదివారు. 

ఇంటర్​ సిద్దిపేటలో చేసి హైదరాబాద్​లో ఇంజనీరింగ్​ చేశారు. ప్రవీణ్​ కొన్నేళ్ల  కింద ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. అక్కడే ఉద్యోగం సంపాదించి భార్య, ఇద్దరు పిల్లలతో స్థిరపడ్డారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.